మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ…
పెద్దపల్లి జిల్లా అక్టోబర్. 16 (వాయిస్ టుడే) గోదావరిఖని: మాజీ టిఎస్ఆర్టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ బైక్ ర్యాలీ వారి స్వగృహం గౌతమ్ నగర్ నుంచి బయల్దేరి అడ్డగుంటపల్లి అబ్దుల్ కలాం స్టాచు,కళ్యాణ్ నగరు,రమేష్ నగర్ ,ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా,గాంధీ చౌక్, లక్ష్మీ నగర్ నుంచి మార్కండేయకాలనీ, మీదుగా జరిగింది, సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటు వేసి గెలిపించండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని సోమారపు అన్నాడు రామగుండం నియోజకవర్గంలో అవినీతి లేకుండా స్వచ్ఛందంగా పాలన చేస్తానని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని విధాలుగా సేవ చేస్తానని ఆయన అన్నారు . మళ్లీ ఒక్కసారి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే గోదావరిఖని ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు



