వనస్థలిపురం, వాయిస్ టుడే: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేస్తామని బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ పేర్కొన్నారు. అధిష్టానం తమకు టికెట్ కేటాయించిన సందర్భంగా శనివారం వారి నివాసం వద్ద నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దయానంద్ గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా ప్రకటించినందుకు జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి గెలుపే లక్ష్యంగా అందరూ కంకణబద్ధులై పనిచేసి కాషాయ జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, బోసుపల్లి ప్రతాప్, పోరెడ్డి నరసింహారెడ్డి, కొత్త అశోక్ గౌడ్, గోగిరెడ్డి లచ్చి రెడ్డి, అంజయ్య యాదవ్, పోరెడ్డి అర్జున్ రెడ్డి, యాదగిరి రెడ్డి, కొండ్రు పురుషోత్తం, బచ్చిగళ్ళ రమేష్, ధరావత్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.



