హైదరాబాద్: ముషీరాబాద్, అంబర్ పేట లలో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ ను ఈ ఎన్నికలలో ప్రజలు బొంద పెడతారు. 40 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా. ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ నుండి తప్పుకున్నారు. రెండు సీట్లు గెలిచిన బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ని ఎలా చేస్తారని అన్నారు. కేంద్రమంత్రి గా పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అంబర్ పేట నియోజకవర్గంలో కానీ ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలి. మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో కి వచ్చేది ముమ్మాటికీ బీఆర్ ఎస్ ప్రభుత్వమే. అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు.


