హైదరాబాద్‌లో యువకుడి హత్య

- Advertisement -

హైదరాబాద్‌లో పరువు హత్య జరిగింది. అంబర్‌పేట్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని, అమ్మాయి మేనమామ క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. వివరాలు.. బాపునగర్‌కు చెందిన మౌనిక అనే అమ్మాయి శ్రీనివాస్ రాజును గత కొద్ది రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది అమ్మాయి మేనమామ పుష్ప రాజ్‌కు నచ్చలేదు. శ్రీనివాస్ రాజు‌పై కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి బ్యాట్‌తో చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  అనంతపురం జిల్లాలో గతేడాది జూన్ నెలలో పరువు హత్య జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన మురళి, వీణలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాలమ్మ, నాగన్న దంపతుల కుమారుడు మురళి (27),  ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా పని చేస్తున్న వీణ ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రాప్తాడులో నివాసం ఉండేవారు. రాప్తాడు వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై  కంపెనీ బస్సు కోసం మురళి వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసి హతమార్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular