- Advertisement -
సుధీర్ రెడ్డి గెలుపుతో ఎల్బీనగర్ లో సంబురాలు
బాణాసంచా కాల్చి కార్యకర్తల వేడుకలు
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుధీర్ రెడ్డిని పార్టీ కార్యకర్తలు ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సవం వెల్లివిరిసింది. సుధీరన్న గెలుపు, అభివృద్ధికి మలుపు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కడా చూసినా సుధీర్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి.
- Advertisement -



