హైదరాబాద్: ఎన్నికల్లో భారాస ఓటమీ నేపధ్యంలో తెలంగాణలోని వివిధ కార్పోరేషన్ల చైర్మన్ లు రాజీనామాలు చేసారు. వారి రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారుర. తెలంగాణ పునర్నిర్మాణం లో మాకు అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీ ఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ,బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల కనుగుణంగా పని చేస్తామని పేర్కోన్నారు. డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్ రవీందర్ సింగ్ ,డా .వాసుదేవ రెడ్డి ,మన్నే క్రిశాంక్ ,గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,పల్లె రవికుమార్ గౌడ్ ,పాటి మీద జగన్ మోహన్ రావు ,అనిల్ కూర్మాచలం ,గజ్జెల నగేష్ ,మేడె రాజీవ్ సాగర్ ,డా .ఆంజనేయులు గౌడ్ ,సతీష్ రెడ్డి ,రామచంద్ర నాయక్ ,గూడూరి ప్రవీణ్ ,వాల్యా నాయక్ తదితరులు రాజీనామాలు చేసారు.



