- Advertisement -
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు వచ్చిన ఎన్నికల ఫలితాలే ఆ పార్టీకి ఏపీలో కూడా వస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అదే విషయాన్ని విశాఖలో పవన్ నిర్వహించిన సభ మరోసారి రుజువు చేసిందన్నారు. విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే విశాఖ రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే ఈ సిటీపై విషం చిమ్ముతున్నారని, వ్యక్తిగతంగా సీఎంపై అవాస్తవాలతో కూడిన విమర్శలు చేశారని మండి పడ్డారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశాక పవన్ కు మతి భ్రమించినట్లు కనిపిస్తోందని ఏద్దేవా చేశారు.
- Advertisement -



