Monday, April 27, 2026

నోట్ల కట్టలు లెక్కపెట్టడానికి 40 మంది

- Advertisement -

న్యూడిల్లీ, డిసెంబర్ 11: డబ్బులను లెక్కించడానికి కొన్ని గంటలు కాదని.. చాలా రోజులు పడుతుందని అంటున్నారు. ఇంకా డబ్బు చాలా ఉంది, దొరికిన డబ్బులను ఉంచడానికి ఒకటి కాదు, చాలా అరలు అవసరం అయ్యాయి. దీని తరువాత కూడా, మిగిలిన డబ్బు చాలా సంచులలో నింపారు. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాల్లో దొరికిన నల్లధనం పరిస్థితి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూ.290 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటా ఇంకా పూర్తి కాలేదు. విచారణ ఇంకా కొనసాగుతోంది. 7 గదులు, 9 లాకర్లు తెరవాల్సి ఉంది.డబ్బులను లెక్కించేందుకు 40-50 మందితో కూడిన బృందాన్ని నియమించారు. అంతేకాకుండా 40 చిన్న, పెద్ద నోట్ల లెక్కింపు యంత్రాలను ఏర్పాటు చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశాలోని ఎస్‌బీఐ బలంగీర్‌ బ్రాంచ్‌కు తీసుకొచ్చారు. ఈ డబ్బును మొత్తం 176 బస్తాల్లో తీసుకొచ్చారు. డబ్బుల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. భారతీయ చరిత్రలో ఏ ఏజెన్సీ నిర్వహించని అతిపెద్ద రికవరీగా ఇది పరిగణించబడుతుంది.కాంగ్రెస్ ఎంపీ సాహు కి చెందిన పలుచోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన నగదులో అత్యధికంగా రూ.500 నోటు ఉన్నట్లు సమాచారం. ధీరజ్ సాహు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం బృందం మూడు సూట్‌కేస్‌లను తీసుకొచ్చింది. ఈ సూట్‌ కేసుల్లో ఆభరణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంకా ధృవీకరించాల్సి ఉందితమ ఎంపీ సాహు కి చెందిన ఆస్తులపై ఐటీ దాడులు భారీగా పట్టుబడిన నగదుపై ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో సాహు విషయంలో కాంగ్రెస్ దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

40 people to count bundles of notes
40 people to count bundles of notes

ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాశారు. దాడుల్లో  ఇంత భారీ మొత్తంలో నగదు ఎలా రికవరీ అయ్యిందనే దానిపై సాహు వివరణ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారంతో జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సాహు ఉన్న ప్రాంతాల నుంచి ఇంత భారీ మొత్తంలో నగదు ఎలా రికవరీ చేస్తుందో అతను మాత్రమే వివరించగలడు..  వివరించాలని పేర్కొన్నారు.అదే సమయంలో ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ ప్రధాని మోడీతో సహా పలువురు సీనియర్ బిజెపి నాయకులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ధీరజ్ సాహు కుటుంబం మద్యంతో పాటు హోటల్, రియల్ ఎస్టేట్, రవాణా ,చేపల వేట వంటి అనేక ఇతర వ్యాపారాలు చేస్తుందని తెలుస్తుంది. అయితే నగదు స్వాధీనంపై ఎంపీ ధీరజ్ సాహు నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్