సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

- Advertisement -

న్యూ డిల్లీ, డిసెంబర్ 13: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కేంద్రం ఏర్పాటు చేయనున్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం ఎతలిపింది. పార్లమెంట్‌లో భద్రతా లోపంపై అమిత్‌షా ప్రకటనను డిమాండ్‌ చేశాయి. ఆ తర్వాత కేంద్ర విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు-2023ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యస సభ ఆమోదం తెలిపింది. గతవారం లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తప్పనిసరి అని చెప్పారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య, పరిశోధనా సౌకర్యాలను సులభతరం చేస్తుందన్నారు. గిరిజన విద్యపై దృష్టి పెట్టడమే కాకుండా.. ట్రైబల్ యూనివర్సిటీ ఇతర సెంట్రల్ యూనివర్సిటీల మాదిరిగానే విద్య, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular