- Advertisement -
బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలు దానం
జగిత్యాల
కోరుట్ల మండలం ఏకీన్పూర్ కు చెందిన చాడ శ్రీనివాస్ భార్య చాడ సంధ్యారాణి (40) కొద్ది రోజుల క్రితం అల్లమయ్య గుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి తలకి తీవ్ర గాయమైంది.
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలుపగా వారి కుటుంబ సభ్యులు బుధవారం ఆమె అవయవాలు దానం చేశారు.
- Advertisement -



