
మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహన్
కరీంనగర్
మధ్యప్రదేేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం కరీంనగర్ లో పర్యటించారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి హాజరైయారు. ఎంపి బండి సంజయ్ కుడా కార్యాక్రమానికి
హజరయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ తెలంగాణలో 10కిపైగా ఎంపీ సీట్లు సాధించబోతున్నాం. కరీంనగర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నా కుటుంబ సభ్యులను కలిసినట్లుగా ఉంది. దేశమంతా
చర్చించుకునేలా చేసిన గొప్ప నాయకుడు బండి సంజయ్. బీజేపీ చరిత్రలో ఇంతవరకు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన నాయకుడు బండి సంజయ్. బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించండని అన్నారు.
తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ నుండే శ్రీకారం చుట్టాలి. బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు. జాతీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఎక్కడా లేకుండా పోయిందని అన్నారు.
ఎంపి బండి సంజయ్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలంతా మామాజీ అని ఆప్యాయంగా పిలుచుకునే శివరాజ్ సింగ్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. కరీంనగర్ లో ఇంటింటికీ అయోధ్య రామయ్య పొటో ఫ్రేమ్ లు
అందజేస్తాం. కాంగ్రెస్, బీ అర్ ఎస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండని అన్నారు.



