కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన
కోరుట్ల
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని
30, 31వ వార్డులలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై
బీజేపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు..
ఈ సందర్భంగా అనుగారిన వర్గాలకు సామాజిక భద్రత పీఎం సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పిఎం ముద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన, రైతు సంక్షేమ భరోసా, ఆహార
భద్రత భరోసా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఆనంతరం
కేంద్ర ప్రభుత్వ పథకాలు,
ఆయుష్మాన్ భారత్,
,పీఎం విశ్వకర్మ యోజన, ముద్ర లోన్, కిసాన్ క్రెడిట్ కార్డు, ఉజ్వల గ్యాస్ సిలిండర్, పలు రకాల
పథకాలకు
దరఖాస్తుల స్వీకరించారు.. ఈ సందర్భంగా కోరుట్ల బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేని మహేష్, కౌన్సిలర్ మాడవేని నరేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలాల సాయిచంద్, జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్,
సీనియర్
నాయకులు గజెళ్ళి రాజేంద్ర ప్రసాద్, కైరం కొండ రాజేశం,తోట రాజేష్, ఓం ప్రకాష్,ఎర్ర రాజేందర్, ఉరుమల్ల నరేష్, ఎంఎస్,అక్మల్, తదితరులు పాల్గొన్నారు.



