కాంగ్రెస్ ది అక్రమాల చరిత్ర
కిషన్ రెడ్డి
హైదరాబాద్
కేసిఆర్ హయాంలో సిటీ చుట్టూ పక్కల భూముల చేతులు మారాయి. వాటి మీద సమగ్రమైన విచారణ జరగాలి . కాంగ్రెస్ ది అక్రమాల చరిత్రఅని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
అందుకే ఒక్కటి రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యింది. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదు. ప్రస్తుతం బీ అర్ ఎస్ అవశ్యకత లేదు. గత పదేళ్ళలో అభివృద్దికి బదులు ప్రజల ఆత్మ గౌరవం ను బీ అర్ ఎస్ దెబ్బ తీసింది. దేశ అబివృద్ధి కోసం బీజేపీ లో చేరాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న రోజుల్లో బీ అర్ ఎస్, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి వారి బండారం బయట పెడతామని అన్నారు.
మేము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సెక్రెటరీ గా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ లో చేరారు. ఫిబ్రవరి మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ లో చేరికలు ఉంటాయి. చేరికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. సిఆర్ కుటుంబం మీద కోపం తో కాంగ్రెస్ కి ఓటేశారు. కాంగ్రెస్ గెలవలేదు .. బీ అర్ ఎస్ ను ఓడించారు. కాంగ్రెస్స్ గెలిచిన సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
కాంగ్రెస్ ది అక్రమాల చరిత్ర
- Advertisement -
- Advertisement -



