రంగారెడ్డి జిల్లా.
రాజేంద్రనగర్ నియోజకవర్గం

నార్సింగి పోలీస్ స్టేషన్.
అధికార కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల కొమ్ములాట.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర మైసమ్మ దేవాలయ సమీపంలో కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు దుషించుకుంటూ పరస్పరం కట్టెలతో దాడులకు పాల్పడ్డారు.
నార్సింగ్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో భాగంగా పార్టీ సీనియర్ నాయకులను ఉద్దేశించి దుర్భాషలాగడం చర్చనీయాంశమైనది ఆంజనేయులు అనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అతని కుమారుడు అభిలాష్ ముదిరాజ్ ఆర మైసమ్మ ప్రధాన రహదారిపై పరస్పరం ఒకరిపై ఒకరు దూషించుకుంటూ కర్రలతో దాడులకు పాల్పడ్డారని ప్రధాన రహదారి పై పూర్తిగా జామ్ అవడంతో పోలీసులు ప్రవేశించి ఇరు వర్గాలని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించడమైనది.
ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా నార్సింగ్ సీఐ తెలియజేశారు.



