ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ ను అప్రమత్తంగా తరలించాలి
కరీంనగర్ ఏప్రిల్ 19
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ ల పరిశీలన
ఫస్ట్ రాండమైజేషన్లో భాగంగా కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఆయా నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్ లకు అధికారులు అప్రమత్తంగా తరలించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ లోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీగా వెరిఫై చేయాలని జిల్లా కలెక్టర్ అధికారుల కు సూచించారు. ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. తగిన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని తెలిపారు. పలు వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, ఆయా రాజకీయ పార్టీల నేతలు సత్యనేని శ్రీనివాస్, మడుపు మోహన్, కళ్యాడపు ఆగయ్య, బర్కత్ అలీ, మిల్కూరీ వాసుదేవ రెడ్డి, తహసీల్దార్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.