నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన డివైఎఫ్ఐ
గోదావరిఖని ప్రతినిధి జూన్ 26
నీట్ ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలపైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్లక్ష్యన్ని వీడి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ టి ఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని డివైఎఫ్ఐ. ఎన్ ఎస్ యు ఐ.I శ్రేణులు బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.
ఈ సందర్భంగా బి వై ఎఫ్ ఐ.జిల్లా అధ్యక్షులు సాగర్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి దుర్గ మాట్లాడుతూ విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా కూడా ఎంతో మంది విద్యార్థులు వైద్య వృత్తి ద్వారా సమాజంలో సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో కష్టపడి వేల రూపాయలు ఖర్చుపెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ పరీక్ష రాయగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్ధకంగా మారిందని వారు మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నీట్ పరీక్షలో జరిగిన అవగతవకల పైన సమగ్ర విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించి తిరిగి పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థి యువజన లోకం గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంటే ప్రధాని మోడీ దున్నపోతు మీద వర్షం పడ్డ మాదిరిగా పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గమని వారు అన్నారు. విదేశాలు తిరగడానికి మోడీకి సమయం దొరుకుతుంది కానీ దేశం వ్యాప్తంగా నిర్వహించిన నీటి ఎగ్కళాకారులకు ఉచితం



