Friday, March 6, 2026

 రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు

- Advertisement -

 రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్

A kingdom where a farmer cries will not improve

ఒట్టులు వేసి..దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి  మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు. రుణమాఫీ నియమనిబంధనలు రైతులకు ఉరి తాళ్ళుగా మారతాయన్నారు. రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మోసం చేయాలని చూస్తారని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తుచేశారు.
ప్రజల ఆలోచన పట్ల రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ.. అవమానాన్ని భరించరన్నారు.మోసగాళ్ళను, మాట ఇచ్చిన తప్పినవారిని అంతిమంగా ప్రజలు బొంద పెడతారని హెచ్చరించారు.
అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అని ఎంపీ విరుచుకుపడ్డారు. మరోసారి మోసగించబడ్డామని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారన్నారు. ఐదేళ్ళు అధికారం ఇచ్చారని. ఇష్టం వచ్చినట్లు చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారన్నారు. గతంలో విమర్శలు చేసినరేవంత్.. ఏడు నెలల నుంచి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చిత్తు కాగితంతో సమానమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ఉన్న ద్యాస.. ప్రజా సమస్యలపై లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదని. పేదల ఇళ్ళు కూలగొట్టటమే పనిగా రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకుందని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్