మంత్రుల పర్యటన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు..
పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్
రామగుండం
During the visit of the Ministers, a prestigious arrangement will be made.
హెలిప్యాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం, మీటింగ్ ప్రాంతాల పరిశీలన
నేడు పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండల ల పరిధిలోని కొలనూర్, పెద్దరాత్ పల్లి, కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతాలలో రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పోన్నం ప్రభాకర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ (ఐజి) తెలిపారు.సీపీ పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, పెద్దపల్లి డీసీపీ చేతన తో కలిసి హెలిప్యాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం,పాలం ఆయిల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ స్టోన్ ప్రాంతం, రెడ్డి ఫంక్షన్ హల్ లోని పబ్లిక్ మీటింగ్ ప్రాంతాల పరిశీలించి పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు లపై సమీక్షించి అధికారులకు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్, శిల పలకాల ప్రారంభోత్సవాల వద్ద ఉండే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్య అతిథులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చుడాలని అధికారులకు భద్రతాపరమైన ఆదేశాలు, సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.



