Thursday, September 19, 2024

క్షుద్రపూజల అనుమానంతో హత్య

- Advertisement -

క్షుద్రపూజల అనుమానంతో హత్య

Murder on suspicion of witchcraft

రాయ్ పూర్, సెప్టెంబర్ 16, (వాయిస్ టుడే)
ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలతోసహా ఐదురుగురిని గ్రామస్థులు దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్తాల్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను మౌసం కన్న (34), మౌసం బిరి, మౌసం బుచ్చా (34), మౌసం అర్జో (32), కర్కా లచ్చి (43), 11-నెలల కుమారుడు యష్గా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని ఐదుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న సుక్మా జిల్లా ఇక్తాల్‌ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లా నుంచి సెప్టెంబర్ 13న ఇద్దరు దంపతులను, మరో ఇద్దరు మహిళను తీసుకొచ్చి గ్రామస్థులంగా దారుణంగా హింసించి, చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా మరణించింది. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు దంపతులు, భర్త ఇద్దరు సోదరీమణులు, చిన్నారిని సుత్తి, పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. ఆ గ్రామస్థులకు చేతబడి చేస్తున్నారనే అనుమానం కలగడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసికందుతో సహా ఛిద్రమైన మృతదేహాలను చూసి నివ్వెరపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని బలోడా బజార్ ఎస్పీ విజయ్ అగర్వాల్ చెప్పారు.హబాధితులు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో కుటుంబంపై దాడి చేశారని తెలిపారు.ఈ హత్యలు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కస్డోల్‌లోని ఛార్‌చెడ్ గ్రామంలో జరిగాయి. వీరందరినీ సుత్తి, పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టి చంపారు. ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో అదే కుటుంబానికి చెందిన వృద్ధురాలు ప్రాణాలతో బయటపడిందని ఎస్పీ విజయ్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం ఇదే విధమైన ఘటన భాతపరా జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్