- Advertisement -
అటొ, కారు ఢీ… విద్యార్ధి మృతి
Auto and Car Accident...Student Diedపలువురికి తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం
ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ శివారులో పూసగూడెం వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటోను ములకలపల్లి వైపు నుండి పాల్వంచకు వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఘటనలో ఆటో డ్రైవర్ తో సహా ఏడుగురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 కు సమాచారం ఇచ్చి పాల్వంచ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పూసగూడెం పంచాయతీలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న రచ్చ ఉపేందర్ కుమారుడు
జష్వంత్ (12) మృతి చెందాడు. ఆటో డ్రైవర్ తో సహా మిగతా ఆరుగురు పిల్లలకు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం..మిగతావారి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -




