- Advertisement -
మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాల సందర్భంగా లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
Maoist Party issued letter on the occasion of 20th anniversary of Maoist Party
భద్రాద్రి కొత్తగూడెం
మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ లేఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు పార్టీ 20వ వార్షికోత్సవాలను ఏరియా వ్యాప్తంగా విప్లవోత్తేజంతో ఘనంగా జరుపుకోండి. ప్రజా పునాదిని పెంచుకుంటూ ప్రజా యుద్ధాన్ని పురోగమింపజేయండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విప్లవ ప్రతిఘాతుక వ్యూహాత్మక ఆపరేషన్ కగార్ దాడిని ఓడించండి. పార్టీ 20వ వార్షికోత్సవాలను ఘనంగా జరపండి. ప్రజా పునాదిని పెంచుకుంటూ విప్లవ నిర్మాణాలను బలోపేతం చేద్దాం. ఆపరేషన్ కగార్ దాడిని ఓడిద్దాం గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేద్దాం. మార్క్సిజం- లెనినిజం- మావోయిజం వర్ధిల్లాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలని అంటూ చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ మరియు ఆజాద్ పేర్లతో రెండు లేఖలు విడుదల చేసింది.
- Advertisement -



