Saturday, April 25, 2026

సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ?

- Advertisement -

సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ?

Government that does not implement Super Six a good government?

ముంచే ప్రభుత్వమా ?
కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుంది
– వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ
కూటమి ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుంది. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? శ్వేత పత్రం విడుదల చేయండని ఏపిసిసి ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేసారు.
బుధవారం నాడు జరిగిన థాలి బజావ్ కార్యక్రమంలో ఆమె పాల్గోన్నారు. షర్మిల మాట్లాడుతూ  ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా థాలి బజావ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం.  పల్లెం,గంటే తో నిరసన చేపట్టాం.  ఇది చంద్రబాబు కి వినపడాలని మా ఉద్దేశ్యమని అన్నారు. ఇది మంచి ప్రభుత్వమట.  ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎట్లా మంచి ప్రభుత్వం అవుతుందో బాబు సమాధానం చెప్పాలి. సూపర్ సిక్స్ లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు అన్నమాట. ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ ఇవి లేవు. ప్రభుత్వ పరంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవు.  అన్నదాత సుఖీభవ ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  20 వేలు ఇస్తామని చెప్పిన హామీ అటకెక్కినట్లె ఉంది.  ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పడిన వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.  కానీ చంద్రబాబు కేవలం 2 లక్షల ఎకరాలకు పరిహారం అంటున్నారు.  పరిహారం మీద కోత పెట్టిన ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వం అనారా ?  రాష్ట్రంలో రైతుల కష్టాలు కనిపించడం లేదా ?  వరదలో సర్వం కోల్పోతే కేవలం 4 లక్షల మందికి పరిహారం ఇస్తారా ?  ఇదే ముంచే ప్రభుత్వం కాకపోతే మరేంటని అన్నారు.
ప్రధాని  మోడీకి రాష్ట్రం పై చిన్నచూపు వుంది.  ఇక్కడ వరదల్లో సర్వం కోల్పోతే రైల్ నీర్ కూడా ఇవ్వలేదు.  ఏడాదికి 6 వేల కోట్ల ఆదాయం రైల్వే శాఖ తీసుకుంటుంది.  ఇదేనా మోడీకి రాష్ట్రం మీద ప్రేమ ?  రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ తో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలి.  తల్లికి వందనం పథకం అమలు లేదు.  ఎంతమంది బిడ్డలు అంటే అందరికీ 15 వేలు ఇస్తాం అన్నారు.  గత ప్రభుత్వం ఒక బిడ్డకు ఇచ్చారు.  ఈ ప్రభుత్వం కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు.  గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే…ఈ ప్రభుత్వాన్ని గద్దేనెక్కించారు.  ఈ ప్రభుత్వం కూడా ముంచే ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు.  మహాశక్తి పథకం కింద ఇచ్చే 15 వందలు ఎక్కడ ?  కోటి మంది మహిళలకు ఎప్పుడు పథకం వర్తింప జేస్తారని అన్నారు.
బాబు సర్కార్ మీద కూడా జనాలు విశ్వసనీయత కోల్పోతున్నారు. గతంలో జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది. చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం. మీది మంచి ప్రభుత్వం అయితే…. సూపర్ సిక్స్ అమలు చేయండి. భాద్యతలను విజయలుగా చెప్పుకోవడం మానండి.  ప్రభుత్వానికి నిధులు కొరత అని చెప్పడం మానండి .  ఎన్నికలకు ముందే రాష్ట్రం 11 లక్షల కోట్లు అప్పులు అని మీకు తెలుసు.  మీరు మంచి చేస్తారు అని ప్రజలు మీకు ఓటేశారు.  ఇది మంచి ప్రభుత్వం కాదు…ముంచే ప్రభుత్వం.  సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు…ఒక శ్వేత పత్రం విడుదల చేయండని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్