- Advertisement -
మన బడి బిల్లులు చెల్లించాలని నిరసన
Protest to pay our school bills
వికారాబాద్
పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి లో భాగంగా పని చేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఎస్సేపి చైర్మన్లు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉరివేసుకొని చనిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళనకు దిగారు.బిల్లులను చెల్లించకపోతే కుదువపెట్టి బంగారం, అప్పుచేసిన డబ్బుల వడ్డీ, మిత్తులు కట్టలేక ఉరి వేసుకోవడమే శరణం అంటున్నారు పాఠశాలల అభివృద్ధి పనులు చేసిన స్కూల్ కమిటి చేర్మన్లు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా నిరసన చేపట్టారు . బస్టాండ్ ముందు ధర్నా చేపట్టడంతో హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి . నిరసన తెలుపుతున్న స్కూల్ కమిటీ చైర్మన్ లను రోడ్డుపై నుంచి పక్కకు పంపించారు ఉరి వేసుకునేందుకు తెచ్చుకున్న తాళ్ళను తీసుకువెళ్లారు పోలీసులు.
- Advertisement -



