- Advertisement -
ప్రజలపై భారీ విద్యుత్ బారం మోపెందుకు సిద్దమైన రేవంత్ సర్కార్
Revanth Sarkar is ready to impose huge electricity burden on peopleకేటీఆర్ నాయకత్వం విద్యుత్ చార్జీల భారాన్ని అపడంలో విజయం
రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్.
గోదావరిఖని
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఈ ఆర్ సి ని కేటీఆర్ ఒప్పించి ప్రజలపై విద్యుత్ బారం పడకుండా అపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకమని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ ఎస్ పార్టీ రామగుండం బిఆర్ఎస్ ఇంచార్జ్ కోరుకంటి చందర్ అన్నారు.
అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై 18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని పెంచే ప్రయత్నాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పబ్లిక్ హియరింగ్ లో ఒప్పించి మాఫీ చేయించిన క్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకల చేసుకున్నారు. గోదావరిఖని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టపాసులు పేల్చి ఆటపాటలతో సంబరాలు చేశారు. కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజల పైన అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈ ఆర్ సి ముందు ఉంచడంలో విజయం సాధించారన్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఇదే క్రమంలో ఇటీవల విద్యుత్ చార్జీలు పెంచే ప్రయత్నంలో కేటీఆర్ ఈ.ఆర్.ఏ వద్ద ఒప్పించి మాఫీ చేయించారని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల ప్రజలతో పాటు పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతాయన్నారు.కే
- Advertisement -




