Sunday, January 25, 2026

నవంబర్ 29న ఏపీకి మోడీ

- Advertisement -

నవంబర్ 29న ఏపీకి మోడీ

Modi to AP on November 29

విశాఖపట్టణం, నవంబర్ 16, (వాయిస్ టుడే)
నవంబర్‌ 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పార్క్‌ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతోందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.  గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌తో పాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టుల కారణంగా వచ్చే నాలుగేళ్లలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విశాఖలోని పూడిమడకలో ఎన్టీపీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. 84,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్లు వస్తాయని… విండ్, సోలార్‌ హైబ్రిడ్‌ పంప్డ్‌ స్టోరేజీకి కావాల్సిన 20 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టులో ఏపీ జెన్‌కోకు 50 శాతం భాగస్వామ్యం ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో  రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం గురించి కూడా చంద్రబాబు వివరించారు. వీటితోపాటు విశాఖలో టాటా గ్రూప్‌ పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. అక్కడ ఐటీ ప్రొఫెషనల్స్‌ తయారు చేస్తుందని వెల్లడించారు. ఎల్‌జీ సంస్థ కూడా పెట్టుబడులకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2014-19 మధ్య 227 ఎంవోయూలు జరిగినా వైసీపీ ప్రభుత్వం చర్యల కారణంగా వాళ్లు పెట్టుబడులు పెట్టలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి రానున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ రైల్వే జోన్‌ శంకుస్థాపన కూడా మోదీ చేతుల మీదుగా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు ఈ విషయంపై క్లారిటీ తీసుకోనున్నారు. ఇప్పటికే రైల్వే జోన్‌కు కావాల్సిన భూమిని కూడా రైల్వే శాఖకు ప్రభుత్వం అప్పగించింది. శంకుస్థాపన ప్రక్రియ పూర్తి అయితే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్