- Advertisement -
ఐకేసీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల
Minister Thummala visited the IKC Centreసూర్యాపేట
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూర్యాపేట జిల్లా ఐకేపీ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడి, వారికి కావలసిన అన్ని రకాల అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని మరియు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంచి ధర లభించడానికి రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. అలాగే, తూకం తూచుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తగిన సమయంలో చెల్లింపులు జరిపేలా పర్యవేక్షణ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
- Advertisement -




