- Advertisement -
టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసు
Attack case on TDP leader Rangababuవంశీ అనుచరుల అరెస్టు
గన్నవరం
గన్నవరం టిడిపి నాయకుడు రంగబాబు పై దాడి కేసులో వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద టిడిపి నాయకుడు పై కొంత మంది వ్యక్తులు దాడి చేసారు. దాడికి సంబంధించి సూత్రధారులు వైసిపి నాయకులగా పొలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి వైసిపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఓలుపల్లి మోహనరంగా, అనగాని రవి, భీమవరపు యేతంధ్ర రామకృష్ణ(రాము),మేచినేని బాబు,సూరపనేని అనీల్ గోన్నూరి సీమయ్య, గుర్రం నానిలు వున్నారు.
కంకిపాడు పోలీసుస్టేషన్ తరలించినట్లు సమాచారం. కంకిపాడు పోలీసుస్టేషన్ వెళ్లేందుకు కుటుంబ సభ్యులు,వంశీ అభిమానులు, వైసీపీ పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారు.
- Advertisement -




