ప్రశ్నించే గొంతుక మూగబోయింది.

- Advertisement -

ప్రశ్నించే గొంతుక మూగబోయింది.

The questioning voice was muffled.

ప్రసాద్ సంస్మరణ సభలో అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం
ప్రజల పక్షాన రాజ్యాంగ బద్దమైన హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాడే పోటు ప్రసాద్ మరణంతో ప్రశ్నించే గొంతుక మూగబోయిందని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగిన పోటు ప్రసాద్ సంస్మరణ సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ మరణం ఓ షాక్ అని ఊహించని ఈ పరిణామం నుంచి కోలుకోవడం పార్టీ శ్రేణులకే కాదు ఆయన సన్నిహితులకు ఇబ్బందికరమేనన్నారు. ప్రసాద్ అనారోగ్యానికి గురై మరణానికి దగ్గరగా ఉన్న దాఖలాలు లేవని అయినా ఆకస్మిక మరణం పొందడం బాధాకరమన్నారు. హక్కుల కోసం ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రసాద్ లాంటి వారిని కోల్పోవడం యావత్ సమాజానికి తీరని లోటన్నారు. హక్కుల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నినదిస్తూ, వివరిస్తూ రాజ్యాంగ హక్కుల అమలుకు పోరాటాలు సాగించే వ్యక్తులను కోల్పోవడం ఈ వ్యవస్థకు చాలా నష్టమన్నారు. పోటు ప్రసాద్ మితభాషి అని ఇలా ఉండేవారిలో సామాజిక పరమైన సంఘర్షణ ఉంటుందన్నారు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి పోరాటాలు సాగిస్తున్న వ్యక్తులు మరణించడం అట్టడుగు వర్గాల ప్రజలకు తీరని నష్టమన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular