బద్వేల్ మునిసిపల్ ఇంజనీరింగ్ ఆఫీస్ నిర్వహన లో పనిచేస్తున్న కార్మికులు ధర్నా.
Workers working under management of Badwel Municipal Office are on strike.బద్వేల
రాష్ట్ర వ్యాపితంగా మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బద్వేల్ మున్సిపాలిటీ లోని కార్మికులు ధర్నా చేసారు, ఈ సందర్బంగా మునిసిపల్ వర్కర్స్ యూనియన్ బద్వేల్ అధ్యక్షులు. మేరువ. మల్లికార్జున మరియు ఏ ఐ టి యూసి పట్టణ కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ మరియు ఆఫీసు నిర్వహణ లో పనిచేసే కార్మికులకు 15000/-వేతనం సరిపోవడం లేదని. కనీస వేతనం 26000/-ఇవ్వాలని. ప్రభుత్వ సంక్షేమ పథకాలు. రేషన్ కార్డు. తల్లికి వందనం ఉచిత గ్యాస్. ఇలాంటి వి అవుట్ సోర్సింగ్ కార్మికులకు వర్తింప చేయాలన్న కార్మికుల బయోడేటా ఏమైనా తప్పులు ఉంటే ప్రత్యేక కౌంటర్ ద్వారా సరిచేయాలన్నారు కార్మికులు అరుగాలం పనిచేసి మరణిస్తే కార్మికునికి రావలసిన బెనిపిట్స్ తీసుకోవాలంటే అది తప్పు ఇదితప్పు అని సంవత్సరాలు గడుపుతున్నారు దయచేసి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని. అలాగే ఎన్నో యేండ్లు నుండి మునిసిపల్ ఆఫీస్ లో వాటర్ &లైటింగ్ విభాగలలో పనిచేస్తున్న కార్మికులను గుర్తించి మాకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో కార్మికులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు




