- Advertisement -
ఊడిమూడి పంట కాలవలో కారు ప్రమాదం..
Car accident during the harvest season of Oodimudi..ముగ్గురు గల్లంతు
పి గన్నవరం, , డిసెంబర్ 10:
ఉడిముడి శివారు చింతవారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారు జామున మూడు గంటలకు కారు ప్రధాన పంట కాలువ లోకి దూసుకెళ్లింది. తన భార్య ఉమా, పెద్ద కుమారుడు మనోజ్(9)రెండు కుమారుడు రిషి( 7) గల్లంతు అయ్యారని విజయ కుమార్ వెల్లడించారు. వారంతా సి విశాఖపట్నం నుండి పి.గన్నవరం మండలం, పోతవరం సొంత గ్రామానికి చేరుకునే క్రమంలో కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం మండలం ఈతకోట వద్ద భార్య డ్రైవింగ్ తీసుకుందని విజయ్ కుమార్ తెలిపారు. పెద్ద కుమారుడు మనోజ్, కారునుండి గట్టుకి చేరుకోకపోవడంతో ఒడ్డుకు వచ్చిన భార్య, చిన్న కుమారుడు, మనోజ్ ను రక్షించే సమయంలో మళ్లీ కాలువలో వెళ్ళ గా ముగ్గురు గల్లంతయ్యారని భర్త తెలిపాడు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై శివకృష్ణ బృందం చేరుకుని విచారణ చెపట్టింది.
- Advertisement -




