- Advertisement -
మదనపల్లెలో జడ్జి బంగాళాలో– శ్రీగంధం చెట్ల నరికివేత
At Judge's bungalow in Madanapalle-- Cutting of Srigandha treesమదనపల్లె జడ్జి బంగళాలో బుధవారం అర్థరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు శ్రీగంధం చెట్లను నరికివేశారు. గురువారం ఉదయం గమనించిన మదనపల్లె సెకండ్ ఏడిజె కోర్టు అబ్రహం వెంటనే డీఎస్పీ కొండయ్య నాయుడుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డిఎస్పీ, సిఐ ఎరిసావల్లి, ఎస్ఐ వెంకటశివ జడ్జి బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లాలో శ్రీగంధంచెట్ల నరికివేతను పరిశీలించారు. వివరాలు తెలుసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు..
- Advertisement -




