- Advertisement -
పెద్దాపురం గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సత్యప్రసాద్
Collector Sathyaprasad visited Peddapuram Gurukula Schoolజగిత్యాల
జిల్లాలోని పెద్దాపురం గురుకుల పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. గురుకులంలో పాము కనిపించలేదని విద్యార్థులు చెబుతున్నారు. గురుకులంలో గదుల్లోకి పాములు వచ్చే
అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేసారు. నిన్న ఆసుపత్రిలో చేరిన అఖిల్ కు పాము కాటు అని అనుమానమే తప్ప నిర్ధారణ కాలేదని వెల్లడించారు. అఖిల్ పక్కనే ఉన్న మరో విద్యార్థి యశ్వంత్ భయంతో ఆసుపత్రిలో
చేరాడని వెల్లడించారు. ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని… ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పాములు పురుగులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. ఇంకా చిన్నచిన్న గ్యాబ్
లు ఏమైనా ఉంటే ఈరోజు సాయంత్రంలోగా పూడ్చివేస్తామని అన్నారు.
- Advertisement -




