- Advertisement -
కడప కార్పొరేషన్లో మరోసారి కుర్చీ ఫైట్
Another chair fight in Kadapa Corporationకడప
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి గందరగోళం నెలకొంది. మేయర్ సురేశ్ బాబుకు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు. దీంతో మేయర్ సురేశ్ బాబుతో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి వాగ్వాదానికి దిగారు. సీటు కేటాయించకపోవడంతో మేయర్ పోడియం దగ్గరే నిల్చొని నిరసన తెలిపారు. మహిళలను మేయర్ అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.
- Advertisement -




