- Advertisement -
తెలంగాణ భవన్ లో విదేశి యువకులు
Foreign youths in Telangana Bhavanహైదరాబాద్
భారత్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్న స్లోవేకియా దేశ యువకులు మైఖేల్, వైబీరవో బంజారాహిల్స్ లోని తెలంగాణభవన్ను సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయమంతా కలియతిరిగి పార్టీ అధినేత కేసీఆర్, తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ సాధన ఉద్యమ ఫొటోలకు సంబంధించిన వివరాలను కార్యాలయ సిబ్బంది వివరించారు. తెలంగాణ భవన్ సందర్శన తమకు పూర్తి సంతృప్తినిచ్చిందని స్లోవేకియా యువకులు తెలిపారు.
- Advertisement -



