కలెక్టర్ అంటే ఇలా ఉండాలి…
A collector should be like this...
నెటిజన్ల ప్రశంసలు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కలెక్టర్ గా ఆయన తన బాధ్యతలను నిర్వహిస్తూనే విద్యార్థుల బాగోగులను పట్టించుకోవడం పై ప్రశంసల జల్లు
కురుస్తుంది. భరత్ అనే పదో తరగతి విద్యార్థి ఇంటికి ఈరోజు తెల్లవారుజామున వెళ్లిన జిల్లా కలెక్టర్ చదువుపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థికి ముఖ్యమైన దశ అని, చదువును నిర్లక్ష్యం చేయకూడదని, తెల్లవారు
జామున లేచి చదువు కుంటే బాగా మైండ్ లోకి ఎక్కుతుందని కలెక్టర్ భరత్ కు చెప్పారు. భరత్ తండ్రి మరణించారు. తల్లి భరత్ ను చేరదీసి చదవివస్తుంది. దీంతో భరత్ వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఐదు వేల
రూపాయలు నెలకు ఆర్థిక సాయాన్ని పరీక్షల వరకూ ఇస్తానని ప్రకటించారు. ఫిబ్రవరి నెల సాయాన్ని కలెక్టర్ అందచేశారు. బాగా చదువుకుని తల్లికి గిఫ్ట్ ఇవ్వాలని కలెక్టర్ భరత్ ను కోరారు. ఈ విషయం తెలుసుకున్న
అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా కలెక్టర్ చేసిన పనిని అభినందిస్తున్నారు.
నల్గోండ, ఫిబ్రవరి 7, (న్యూస్ పల్స్)
అసలే చలికాలం.. అందులోనూ పల్లెటూరు.. ఊరంగా గుప్పుగా మంచు తెరలు పరుచుకున్నాయి. చలికి.. కొక్కొరొకో కూతతో ఊరిని నిద్రలేపే కోడి కూడా ముడుచుకుని పడుకుంది. తెల్లవారుజామున ఐదు గంటలు..
అప్పుడప్పుడే కొంత మంది ముసలివాళ్లు నిద్రలేచి చలిమంటలేసుకుంటున్నారు. పాలు పితికేవాళ్లు చలికి వణుకుతూనే తమ పనులకు ఉపక్రమిస్తున్నారు. అదే సమయంలో పెద్ద కారొకటి వచ్చి ఆగింది. అయితే
గియితే.. పొద్దున్నే పాల వ్యాను రావాలి కానీ.. దాని కంటే ముందే వచ్చిన ఈ కారు ఎవరిదబ్బా అని అక్కడున్న వాళ్లు తదేకంగా చూస్తున్నారు. అందులో నుంచి టిప్ టాప్గా ఉన్న ఓ ఆఫీసర్ కిందికి దిగాడు. ఆయన
వెంట మరో ఇద్దరు ముగ్గురు కూడా దిగారు. చకచకా ఓ ఇంటికి వెళ్లి.. టక్ టక్ మంటూ తలుపు కొట్టారు. ఇంత పొద్దున ఎవరబ్బా అనుకుంటూనే ఆ ఇంటి మహిళ తలుపు తీసింది.ఎదురుగా ఉన్న ఆఫీసర్ను చూసి..
ఆమెకున్న నిద్రమబ్బు మొత్తం వదిలిపోయింది. “ఎవరూ ఈ సారూ.. ఇంత పొద్దుగల్ల మా ఇంటికి ఎందుకొచ్చిండు..?” అని ఆమె మనసులో ప్రశ్నల ఊట మొదలైంది. నోరు పెగల్చి ఎవలు కావాలే అని
అడిగాలనుకుంటుండగానే.. ఆ సారే ఆమెను పలకరించాడు. భరత్ చంద్ర మీ అబ్బాయేనా.. పదో తరగతి చదువుతున్నాడు కదా.. అని అడిగితే.. అవును అన్నట్టుగా తలూపింది. అప్పటికీ ఆమె ముఖంలో ఉన్న
ఆశ్చర్యంతో పాటు ప్రశ్నార్థకాన్ని గమనించి.. తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆ వ్యక్తి.ఆ వ్యక్తి ఎవరో కాదు.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఆయన వెళ్లింది సంస్థాన్ నారాయణపూర్
మండలంలోని శేరిగూడెంలోని విజయలక్ష్మి ఇంటికి. విజయలక్ష్మి కుమారుడు భరత్ చంద్ర ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. భరత్ చంద్రకు తండ్రి లేకపోవటంతో.. విజయలక్ష్మి కష్టపడి తన చదివిస్తోంది. భరత్
చంద్ర స్థితిగతులు తెలుసుకున్న కలెక్టర్ హనుమంతరావు.. తాను శ్రీకారం చుట్టిన కొత్త కార్యక్రమం “వేకప్ కాల్”లో భాగంగా.. ఉదయం ఐదున్నరకు వాళ్లింటికి వెళ్లి తలుపు తట్టి నిద్రలేపారు.పదో తరగతి పరీక్షలు
సమీపిస్తున్న వేళ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ వేకప్ కాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కలెక్టర్. ఇందులో భాగంగా.. పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఉదయాన్ని నిద్రలేపి..
చదివించి పరీక్షలకు సిద్ధం చేపించాలన్నది కలెక్టర్ హనుమంతరావు ఉద్దేశం. ఈ క్రమంలోనే.. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా రాత్రి సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో నిద్రించిన కలెక్టర్..
ఉదయం ఐదున్నరకే ఎలాంటి సమాచారం లేకుండా భరత్ చంద్ర ఇంటికి వెళ్లారు.ఈ సందర్భంగా.. భరత్ చంద్ర గురించి క్షేమ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ హనుమంతరావు.. పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని
అడిగారు. పదో తరగతి అనేది ప్రతి విద్యార్థికి మైలు రాయి అని.. కష్టపడి చదువుకోవాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేవరకు తానే సొంతంగా ప్రతి నెలా 5 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు
తెలిపారు. ఫిబ్రవరి నెలకు గానూ 5 వేల రూపాయలను అప్పటికప్పుడు భరత్ చంద్ర చేతికి అందించారు. అంతేకాదు.. స్టడీ ఛైర్తో పాటు, ఎగ్జామ్ ప్యాడ్, కొన్ని పుస్తకాలు, పెన్నులు కూడా అందించారు. “నిన్ను
చదివించేందుకు మీ అమ్మ ఎంతగానో కష్టపడుతోందని.. నువ్వు కూడా కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుని ఆమెకు సంతోషాన్ని ఇవ్వాలి” అని భరత్ చంద్రకు కలెక్టర్ హనుమంతరావు
తెలిపారు.తన ఇంటికి జిల్లా కలెక్టర్ స్వయంగా రావటం నమ్మలేకపోతున్నానని.. భరత్ చంద్ర తెలిపాడు. ఆయన తన ఇంటికి రావటం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని.. కష్టపడి చదివి మంచి మార్కులు
తెచ్చుకుంటానని.. భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ అవుతానని చెప్పుకొచ్చాడు భరత్ చంద్ర. తన ఇంటి తలుపు తట్టి.. తన కుమారున్ని ప్రొత్సహించి, అండగా నిలబడిన కలెక్టర్కు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపింది.



