- Advertisement -
ఎంపీ వద్దిరాజు ఉపరాష్ట్రపతి ధనఖర్ కు పరామర్శ*
*Date 17/03/2025*
వాయిస్ టుడే
అనారోగ్యానికి గురై కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన ఖర్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. పార్లమెంట్ ప్రాంగణంలోని రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ధన ఖర్ ను ఎంపీ రవిచంద్ర పలువురు సహచర సభ్యులతో పాటు కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భగవంతున్ని కృపాకటాక్షాలతో ధనఖర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి,దేశ ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు.
- Advertisement -



