సోషల్ మీడియా సైకోలను రోడ్డు మీద ఉరి తీయాలి వైఎస్ షర్మిలా రెడ్డి

- Advertisement -

సోషల్ మీడియా సైకోలను రోడ్డు మీద ఉరి తీయాలి
వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ

Social media psychos should be hanged on the road
YS Sharmila Reddy

భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం.  ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు.  తప్పుడు కూతలు కూసిన వెధవలను,  రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే.  కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నా. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు.  ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి.  వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది.  ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ,టీడీపీలే.  సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు.  రక్త సంబంధాన్ని మరిచారు.  రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు.  మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు.  అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు.  అక్రమ సంబంధాలు అంటగట్టారు.  మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు.  ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular