ఫాస్ట్ట్యాగ్ యుగానికి వీడ్కోలు..
మే 1 నుంచి మారనున్న కొత్త విధానం
హైదరాబాద్ ఏప్రిల్ 17
Farewell to the era of FASTag..
New policy to change from May 1దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్ట్ట్యాగ్ వ్యవస్థ ఇకపై బంద్ కానుంది. GPS ఆధారిత టోల్ వసూళ్ల విధానం (GNSS) ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. దీంతోపాటు టోల్ ప్లాజాల వద్ద రద్దీ సమస్యలు కూడా ఉండవు.దేశంలో జాతీయ రహదారులపై టోల్ ఫీజుల వసూళ్ల విధానంలో కీలక మార్పు రానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో, GPS ఆధారిత టోల్ వసూళ్ల విధానం (GNSS) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మార్పు వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి, ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించేందుకు ఉపయోగించే టెక్నాలజీ. ఈ విధానం ద్వారా టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఆటోమేటిక్గా టోల్ వసూళ్లు జరుగుతాయి.




