- Advertisement -
పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
న్యూఢిల్లీ
Balakrishna receives Padma Bhushan award
: రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ భూషణ్ అవార్డును నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి కళా రంగంలో పద్మభూషణ్ అవార్డు నందమూరి బాలకృష్ణకు, సాహిత్యం, విద్యా రంగంలో పద్మశ్రీ అవార్డులు వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, కె.ఎల్.కృష్ణలకు, మాడుగుల నాగఫణి శర్మకు, కళా రంగంలో మిరియాల అప్పారావు (మరణానంతరం)కు ప్రకటించింది.
పద్మ భూషణ్ అవార్డు అందుకోవడానికి నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా ఢిల్లీ పార్లమెంటు దగ్గరకు చేరుకున్నారు. బాలకృష్ణతోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు అల్లుళ్లు, కుమారుడు పార్లమెంటు దగ్గరకు చేరుకున్నారు.
- Advertisement -



