Wednesday, February 18, 2026

రెండో వారంలో ఐదు రాఫ్ట్రాల ఎన్నికలు నోటిఫికేషన్

- Advertisement -

రెండో వారంలో ఐదు రాఫ్ట్రాల ఎన్నికలు నోటిఫికేషన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే )

Notification of elections for five rafters in the second week
ఈ ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టింది. ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఎస్ఐఆర్‌పై ఓ పక్క విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చి రెండో వారంలో ప్రకటించి, చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈసీ అధికారులు.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్‌ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇక, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇప్పటికే ఈసీ అధికారులు పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈసీ బృందం అసోంలో పర్యటిస్తుంది.తమిళనాడు, కేరళ, పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీలకు మే నెలలోనూ.. పుదుచ్చేరి శాసనసభకు జూన్ 15తో గడువు ముగియనుంది. ఇక, ఎన్నికల జరగనున్న రాష్ట్రాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివర దశకు చేరుకుంది. ఫిబ్రవరి 10 అసోం, ఫిబ్రవరి 14న పుదుచ్చేరిలో ఓటర్ల జాబితా ప్రచురించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో మంగళవారం తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న కేరళ, 28న పశ్చిమ బెంగాల్లో తుది జాబితాలు విడుదలవుతాయి. కానీ, ఎస్ఐఆర్‌పై తమిళనాడు, బెంగాల్‌లో రగడ కొనసాగుతోంది.తమిళనాడులో డిసెంబరు 19న విడుదల చేసిన ముసాయిదాలో 97 లక్షల మంది పేర్లను తొలగించారు. బెంగాల్‌లోనూ 58 లక్షల మంది పేర్లు డిలీట్ చేశారు. ఇప్పటికే దీనిపై తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దీదీ యుద్ధం ప్రకటించారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసి, స్వయంగా మమతా బెనర్జీ వాదనలు వినిపించడం గమనార్హం.బెంగాల్‌లో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన మమతా బెనర్జీ.. నాలుగోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అటు, బీజేపీ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఆ పార్టీకే అనుకూలమని వచ్చినా.. ఫలితాలు మాత్రం కమలానికి షాకిచ్చాయి. 2011, 2016కు మించి భారీ మెజార్టీతో మమతా బెనర్జీ గెలిచారు. ఈసారి ఏ అవకాశం వదులుకోరాదని కమలనాథులు గట్టిగానే కృష్టిచేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్