Saturday, February 21, 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

- Advertisement -

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
వివిధ సంస్థలతో ఒప్పందాలు
న్యూఢిల్లీ

Chief Minister Chandrababu Naidu participating in India AI Impact Summit – 2026
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజరయ్యారు. ఈ సదస్సుకు న ప్రపంచ క్వాంటం-ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు హజరయ్యారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం  ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌళిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా ఏడు ఒప్పందాలు జరిగాయి. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం… అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు జరిగాయి.
భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ-క్వాంటం వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.
క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC), * క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో,  ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో, * రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో ఒప్పందాలు జరిగాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్