- Advertisement -
బండి భగీరథ్ కు సాధారణ బెయిల్ మంజూరు
పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు హైకోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
మే నెల 16న భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు..
చర్లపల్లి జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు..
గత నెల 20న మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన భగీరథ్ బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యాడు..!
25న తిరిగి జైలుకు వెళ్లాడు.
గత నెలాఖరులో సాధారణ బెయిల్ కోసం భగీరథ న్యాయవాదుల ద్వారా కోర్టు ను అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హై కోర్టు ఈ రోజు భగీరథ్ కు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది..!
లక్ష పూచీకత్తు.. సాక్ష్యాలను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడవద్దని కోర్టు భగీరథ ను ఆదేశించింది
- Advertisement -




