- Advertisement -
త్వరలో రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు
A golf course will soon be set up in the stateవిశాఖపట్నం
కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వర లో ఆంధ్రప్రదేశ్ లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృ తిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా విశాఖ లోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ చాంపియన్షిప్ టోర్నీ -2024 విజేతలకు బహుమానాలు అంద జేసే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. టోర్నమెంట్ విజేత అంగడ్ చీమా, రన్నరప్ అమాండ్ ఆర్ట్ లను మంత్రి కందుల దుర్గేష్ అభినందిం చి ప్రైజ్ మనీ అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్లో క్రీడలు వెలుగొందాలన్న ఉద్దే శంతో ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు నేతృత్వంలో అమరావతి లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
ప్రొఫెషనల్ గోల్ఫ్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ వేదికగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో అక్టోబర్ 2 న లాంఛనంగా ప్రారంభం అయిన ‘వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2024’ నేషనల్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. దేశ విదేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, ప్రొఫెషనల్స్తో పాటు ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు.
- Advertisement -




