Sunday, September 8, 2024

దేశం గర్వించదగ్గ క్షణం

- Advertisement -

శభాష్… ప్లేయర్స్

న్యూఢిల్లీ, అక్టోబరు :  చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు రాణిస్తున్నారు. సెప్టెంబర్ 23 నుంచి జరుగుతున్న ఈ క్రీడల్లో భారత ప్లేయర్లు ఇప్పటికే 18 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. అక్టోబర్ 8 వరకు జరిగే ఆసియా క్రీడల్లో మన ప్లేయర్లు మరిన్ని మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆసియా క్రీడల్లో భారత్ ఇన్ని మెడల్స్ గెలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. చివరిసారిగా భారత్ 2018 ఆసియా క్రీడల్లో 70 మెడల్స్ గెలుచుకుంది. ఇందులో 16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్ ఉన్నాయి. ఇలా గత రికార్డులను బ్రేక్ చేసి 70 ప్లస్ మెడల్స్‌ని భారత ప్లేయర్లు గెలిచిన సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘ఆసియా క్రీడల్లో భారత్ ముందెన్నడూ లేనివిధంగా ప్రకాశిస్తోంది.

A proud moment for the nation
A proud moment for the nation

భారత్ సాధించిన 71 పతకాలు మన అథ్లెట్ల అసమానమైన అంకితభావం, క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఇది భారత్‌కి అత్యుత్తమ మెడల్స్ గణాంకాలు. భారత్ గెలిచిన ప్రతి పతకం మన అథ్లెట్ల కృషి, అభిరుచి గురించి చాటిచెబుతోంది. ఇది యావత్  దేశం గర్వించదగ్గ క్షణం. భారత క్రీడాకారులకు అభినందనలు’ అంటూ ప్రధాని మోదీ తెలిపారు.అలాగే అంతకముందు ఆసీయా క్రీడల్లో అర్చరీలో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత ఆర్చర్లు ఓజాస్ డియోటాలే, జ్యోతి సురేఖ వెన్నమ్‌‌ జోడిని కూడా ప్రధాని మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారత ఆర్చర్ల అసాధారణ నైపుణ్యం, ఖచ్చితత్వం,  కృషి కారణంగానే ఇలాంటి గొప్ప ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్