Sunday, September 8, 2024

రామాపురం లో గుర్రప్ప జాతరకు ముస్తాబవుతున్న గుడి, యాగశాల

- Advertisement -

ఏప్రిల్ 24 నుండి 26 వరకు రామాపురంలో గుర్రప్ప జాతర , విగ్రహ ప్రతిష్టలు, మహా అన్నదానం , ముస్తాబవుతున్న గుడి, యాగశాల. _______సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రామాపురం గ్రామంలో ఉర చెరువు వద్ద ఉన్న పురాతన ఊడల మర్రిచెట్టు వద్ద, ఊర చెరువు పక్కన,నూతనంగా నిర్మించిన బాల గుర్రప్ప స్వామి, గంగమ్మ ,చౌడమ్మ, శ్రీకృష్ణ ,లక్ష్మీ ,సరస్వతి , నందీశ్వరుడు, పోతురాజు ల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 24 నుండి 26 వరకు జరుగుతుందని దేవాలయ నిర్మాణ గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి , తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అర్చకుల, శిష్య బృందం,వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితుల సమక్షంలో ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 26న స్థిర ప్రతిష్ట మహోత్సవం తదుపరి మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

A temple and yagashala being prepared for the Gurrappa fair in Ramapuram
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్