నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం: పోగొట్టుకున్న పర్స్‌ను యజమానికి అప్పగించిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్

- Advertisement -

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం: పోగొట్టుకున్న పర్స్‌ను యజమానికి అప్పగించిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్
కానిస్టేబుల్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ  డి.జానకి,
మహబూబ్‌నగర్‌

A Towering Example of Honesty: AR Constable Shravan Kumar Returns Lost Wallet to Its Owner
మహబూబ్‌నగర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ తన నిజాయితీతో పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచారు. విధుల నిమిత్తం మహబూబ్‌నగర్‌లో ఉన్న సమయంలో ఆయనకు ఒక పర్స్ దొరికింది. ఆ పర్స్‌ను పరిశీలించగా అందులో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, నగదు తదితర ముఖ్యమైన పత్రాలు ఉండటం గమనించారు.
పర్స్‌లో ఉన్న క్రెడిట్ కార్డు వివరాల ఆధారంగా యజమాని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బాలరాజు అని గుర్తించారు. అనంతరం ధన్వాడ పోలీస్ స్టేషన్ ద్వారా బాలరాజుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని అతనికి సమాచారం అందించారు.
శ్రవణ్ కుమార్ సూచన మేరకు బాలరాజు మహబూబ్‌నగర్‌కు చేరుకోగా, అతనికి పర్స్‌లోని నగదు, కార్డులు మరియు ఇతర వస్తువులను యథావిధిగా తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న పర్స్ తిరిగి దొరకడంతో బాలరాజు ఆనందం వ్యక్తం చేస్తూ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ నిజాయితీని అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి.జానకి, కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆస్తులను తమ సొంత ఆస్తుల్లా భావించి బాధ్యతాయుతంగా వ్యవహరించడం పోలీసు శాఖకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి నిజాయితీతో కూడిన సేవా భావం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ గారు తెలిపారు.
ఈ ఘటన పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేదిగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే కాకుండా వారి ఆస్తులను సురక్షితంగా కాపాడేందుకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular