- Advertisement -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
A wife who killed her husband with her boyfriendసంగారెడ్డి
కంది మండలం ఉత్తరపల్లిలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం రాజు 35) దారుణ హత్యకు గురైయాడు. అతని భార్యే భర్తని ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు నిర్దారించారు. ముందు పోలీసుల విచారణలో ఏమి తెలియనట్టు భార్య అమాయకత్వం ప్రదర్శించింది. మృతుడు రాజు, సుమలతలు లవ్ మ్యారేజ్ చేసుకుని క్యాంటీన్ లో కలిసి పని చేస్తున్నారు. క్యాంటీన్ లో హెల్పర్ గా పని చేస్తూ వంట మాస్టర్ తో సుమలత వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం రాజుకు తెలిసింది. దాంతో గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్య విషయం ప్రియుడికి చెప్పి మర్డర్ స్కెచ్ వేసింది. మందు తాగుదామని పిలిచి ప్రియురాలి భర్తను ప్రియుడు హత్య చేసాడు.
- Advertisement -



