Saturday, February 15, 2025

ఆది పినిశెట్టి, అరివళగన్, 7G ఫిల్మ్స్, తెలుగు-తమిళ బైలింగ్వల్ మూవీ ‘శబ్దం’ ఫిబ్రవరి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్- ఆంధ్ర & తెలంగాణలో N సినిమాస్ ద్వారా రిలీజ్

- Advertisement -

ఆది పినిశెట్టి, అరివళగన్, 7G ఫిల్మ్స్, తెలుగు-తమిళ బైలింగ్వల్ మూవీ ‘శబ్దం’ ఫిబ్రవరి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్- ఆంధ్ర & తెలంగాణలో N సినిమాస్ ద్వారా రిలీజ్

Aadi Pinishetti, Arivalagan, 7G Films, Telugu-Tamil Bilingual Movie 'Shabdam' World Wide Grand Release on 28th February - Released by N Cinemas in Andhra & Telangana

‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజా మేకర్స్ ‘శబ్దం’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.  ఈ చిత్రం ఫిబ్రవరి 28, 2025న తెలుగు, తమిళం, కన్నడ  హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.‘వైశాలి’లో ‘వాటర్’  హారర్ ఎలిమెంట్‌ తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు అరివజగన్  ఈ సినిమాలో ‘సౌండ్’ అనే సూపర్ నేచురల్ ఫ్యాక్టర్‌గా ఉపయోగించారు.లక్ష్మీ మీనన్ ఈ సినిమాలో  హీరోయిన్. సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.7G ఫిల్మ్స్ శివ తమిళ చిత్ర పరిశ్రమలో 225 కి పైగా చిత్రాలను పంపిణీ చేసి ద్రౌపతి, రుద్ర తాండవం వంటి చిత్రాలను సహ నిర్మాతగా చేయడం ద్వారా ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఆయన ఇప్పుడు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటివరకు ఆది కెరీర్‌లో మొదటి భారీ బడ్జెట్ చిత్రం.  ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది, ప్రేక్షకులకు ‘హారర్’ స్టయిల్ లో కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు,  ఈ సినిమా ‘సౌండ్’ ఆధారంగా రూపొందినందున, ఈ చిత్రానికి అవుట్ స్టాండింగ్ ఆడియోగ్రఫీని  టి ఉదయ్ కుమార్ సమకూర్చారు.పోస్ట్ ప్రొడక్షన్ పనులుతుది దశకు చేరుకునాయి. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పొందేలా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి.  ఈ చిత్రం N సినిమాస్ ద్వారా ఆంధ్ర & తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్  కానుంది.
తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్