Sunday, September 8, 2024

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయండి

- Advertisement -

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయండి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఈరేష్
కౌతాళం
మండలం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు  ఏఐఎస్ఎఫ్  రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహయ కార్యదర్శి ఎస్.ఈరేష్  మాట్లాడుతూ  ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి 8,9,10 కాకినాడ లో జరుగు విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.  దేశంలో రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులపై సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై విద్యార్థులలో చైతన్యం నింపడానికి విద్యార్థుల శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని  అన్నారు   టిడిపి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ప్రస్తుతం అధికారంలోకి రావడంతో విద్యార్థుల హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్  మండల సహయ కార్యదర్శి మహేష్, మండల ఉపాధ్యక్షుడు సాయి వర్మ, అరికలప్ప, ఖాదర్, గంగరాం,మౌనిక,లక్ష్మి,పూజ,నందిని,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్