Sunday, September 8, 2024

అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలి

- Advertisement -

అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలి

All officers should work in coordination

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల,
అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు..గురువారం రోజున ధర్మపురి నియోజకవర్గంలో వివిధ శాఖల అధికారులతో, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు డ్రైనేజి, త్రాగునీరు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులందరూ అభివృద్ధి కృషికి చేయాలని, గ్రామంలో, పట్టణంలో పారిశుద్ధ్యం డ్రైనేజీ వ్యవస్థ శానిటేషన్ చేయించి దోమలు వృద్ది చెందకుండా శుభ్రపరచాలని, ఎప్పటికప్పుడు అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
త్రాగునీరు సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన త్రాగునీరు పంపిణీ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు…ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు సుధన్, తహశీల్దార్,వివిధ మండల అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్